Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరు..?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (22:07 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సర్కారు వారి పాట". 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అయితే... ఈ సినిమా తర్వాత మహేష్‌ చేయనున్న సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే... 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి మహేష్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. కానీ.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుంది.
 
అందుచేత రాజమౌళితో చేయనున్న మూవీ కన్నా ముందు మరో సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకనే మహేష్ ఇప్పుడు కథలు వింటున్నారని టాక్. రీసెంట్‌గా సీక్రెట్‌గా ఓ కథ విన్నారట. ఇంతకీ మహేష్‌‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరంటే... అనిల్ రావిపూడి అని సమాచారం. 
 
'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్‌ - అనిల్ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. అయితే.. కాస్త టైమ్ తీసుకుని సినిమా చేయాలనుకున్నారు. లాక్డౌన్ టైమ్‌లో టైమ్ దొరకడంతో అనిల్ కథ రెడీ చేసాడట. అనిల్ చెప్పిన కథకు మహేష్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మరి.. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో..? ఎవరు నిర్మిస్తారో క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments