Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకి ఆ ముగ్గురులో విలన్ ఎవరు..? (video)

Webdunia
గురువారం, 16 జులై 2020 (13:34 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తర్వాత చాలా కథలు విని ఫైనల్‌గా గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా లేకపోతే ఈపాటికే సెట్స్ పైకి వెళ్లేది. అయితే... షూటింగ్స్‌కి పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు షూటింగ్ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో మహేష్‌ బాబుకి దీటుగా విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారని తెలిసింది. 
 
అయితే.... కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురిలో ఒకరిని ఈ మూవీలో విలన్ పాత్రకు ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే... ఇంతవరకు ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రను పోషించే అవకాశం ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరి... ఉపేంద్ర, సుదీప్, అరవింద స్వామి.. ఈ ముగ్గురిలో ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments