Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీకి లైగర్ బిగ్ పంచ్, అద్దె కట్టలేని స్థితిలో ఇల్లు ఖాళీ చేసాడా?

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (14:00 IST)
పూరీ జగన్నాథ్. లైగర్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేద్దామనుకున్నాడు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాడు. సుమారు 120 కోట్ల భారీ బడ్జెట్టుతో తెరకెక్కించాడు. కానీ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఆడలేదు. విడుదలైన తొలిరోజే సినిమా ఫ్లాప్ అంటూ రివ్యూలు, కామెంట్లు వచ్చేసాయి. దీనితో సుమారు 60 కోట్ల మేర నష్టపడినట్లు ట్రేడ్ వర్గాలు భోగట్టా.

 
ఇక అసలు విషయానికి వస్తే.... లైగర్ దెబ్బకి పూరీ జగన్నాథ్ అద్దె కట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్నాయి. ముంబై మహానగరంలో ఎంతో ఇష్టంగా తీసుకున్న ఇంటి నుంచి పూరీ ఖాళీ చేసాడని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ఈ ఇంటికి నెల అద్దె అక్షరాల 15 లక్షలు చెల్లిస్తూ వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మొన్నటివరకూ దర్జాగా ఇంట్లో హ్యాపీగా వున్న పూరీ... లైగర్ దెబ్బకి ఆర్థికంగా బాగా ఇరుక్కుపోయాడని అంటున్నారు. లైగర్ హిట్ అయితే ముంబైలోనే సెటిల్ కావచ్చని కూడా అనుకున్నారట.

 
గతంలో కూడా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తినప్పటికీ... హీరో రామ్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో అన్నీ తీరిపోయి లాభాలు వచ్చాయి. దీనితో ఆ డబ్బును పూర్తిగా లైగర్ లో పెట్టేయడమే కాకుండా బడ్జెట్ అంచనా పెరిగిపోవడంతో సుమారు 120 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ అసలులో సగం డబ్బు కూడా రాకపోవడంతో బయ్యర్లు లబోదిబోమంటున్నారట. దీనితో పూరీ జగన్నాథ్ ఇబ్బందుల్లో పడ్డాడని టాలీవుడ్ జనం అనుకుంటున్నారు. ఐతే నిర్మాత చార్మీ మాత్రం ఇవన్నీ రూమర్స్.. రూమర్స్... RIP రూమర్స్ అంటూ కొట్టిపడేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments