Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రముఖి' సీక్వెల్‌లో హీరోయిన్‌గా బాలీవుట్ భామ!!

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:00 IST)
గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు పి.వాసు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'చంద్రముఖి'.ఈ చిత్రంలో హీరోయిన్‌గా జ్యోతిక, నయనతారతో పాటు మరికొందరు నటీమణులు నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ చిత్రం సీక్వెల్ రానుంది. 
 
ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఈయనకు జోడీగా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. చంద్రముఖి ఫస్ట్‌పార్ట్‌లో ప్లాష్‌బ్యాక్‌లో రజనీ వేట్టయ్యన్‌ అనే దుష్ట మహారాజుగా నటించారు.
 
రాజ నర్తకి చంద్రముఖి నిండు సభలో నృత్యం చేస్తుండగా ఆమె ప్రియుడిని వేట్టయ్యన్‌ అనే మహారాజు చంపుతాడు. వేట్టయ్యన్‌, రాజనర్తకి చంద్రముఖి నడుమ జరిగే ఘర్షణల నేపథ్యంలో కొత్త కథ తయారు చేసి దర్శకుడు వాసు ‘చంద్రముఖి-2’ను రూపొందించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కియారాను ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments