Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్యతో సాయిపల్లవినా? లేకుంటే కీర్తి సురేషా?

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (12:13 IST)
టాలీవుడ్ హీరో నాగ చైతన్య మత్స్యకారుల కథతో సినిమా చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మిస్తున్న పేరులేని చిత్రం #NC23గా తెరకెక్కుతోంది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనుంది.
 
పాన్-ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇంకా చందూ మొండేటి మునుపటి చిత్రం "కార్తికేయ 2" దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతమైంది.
 
ఇదే సక్సెస్ మోడ్‌లో చైతూతో కొత్త సినిమాను బంపర్ హిట్ చేయాలని చందు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఈ సినిమాలో దర్శకుడు చందూ మొండేటి సాయి పల్లవిని నటింపజేయాలని భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ చిత్రానికి బలమైన నటనతో తీసిన నటి అవసరం. అలాగే కీర్తి సురేష్ పేరు కూడా ఈ సినిమా కోసం వినిపిస్తోంది. 
Sai Pallavi
 
సాయి పల్లవి గతంలో శేఖర్ కమ్ముల "లవ్ స్టోరీ"లో నాగ చైతన్యతో కలిసి పనిచేసినందున, నాగ చైతన్య- కీర్తి సురేష్‌ల జోడి రిఫ్రెష్ అవుతుందని టీమ్‌లోని కొందరు భావిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరిని చందూ సెలెక్ట్ చేస్తారనేది తెలియాలంటే వేచి వుండాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments