ఆ హీరో తాకితే ఏదేదో అయిపోతోంది.. అతనితో ఇక నటించనంటున్న హీరోయిన్?
బాలీవుడ్ ప్రేమపక్షుల్లో కత్రినా కైఫ్, రణ్బీర్ కపూర్లు ఉన్నారు. ఒక్కో సీజన్లో ఒక్కొక్కరితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయే బాలీవుడ్ సుందరాంగి... ఈ బాలీవుడ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం త
బాలీవుడ్ ప్రేమపక్షుల్లో కత్రినా కైఫ్, రణ్బీర్ కపూర్లు ఉన్నారు. ఒక్కో సీజన్లో ఒక్కొక్కరితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయే బాలీవుడ్ సుందరాంగి... ఈ బాలీవుడ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం తెల్సిందే. పైగా, వీరిద్దరూ ఒకే ఇంట్లో కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత మనస్పర్థలొచ్చి విడిపోయారు. అయినప్పటికీ ఇటీవల వీరిద్దరూ కలసి నిర్మాతల కోసం 'జగ్గా జాసూస్' అనే చిత్రంలో నటించారు.
అయితే, ఇపుడు కత్రినాకు ఏమైందో ఏమోగానీ... రణ్బీర్పై అంతెత్తున మండిపడుతోంది. ఇక అతనితో కలసి నటించనని తాజాగా చెప్పేసింది. అతను తాకితే ఏదేదో అయిపోతోందని అంటోంది. అందుకే రణ్బీర్తో ఇక నటించకూడదని డిసైడయ్యాను. ఇదే అతనితో నా చివరి సినిమా అంటూ కత్రినా చాలా సీరియస్గానే చెప్పింది. కానీ, ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్ కోసం తప్ప వాళ్ళిద్దరు మళ్ళీ ఒక్కటై హ్యపీగా ఉంటున్నారని బిటౌన్ టాక్.