Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయవచ్చు: యష్, పుష్పలకు కంగనా వార్నింగ్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:10 IST)
దక్షిణాది తారలపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారుతూ ఇండియా మొత్తం మార్కెట్ ని సాధిస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా తమ సత్తా చాటుతున్నారు.
 
ఇటీవల ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో స్టార్ అయిపోయాడు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా ఈ పోస్ట్ పెట్టింది.
 
తన స్టోరీలో అల్లు అర్జున్, యశ్ ఫోటోలని షేర్ చేస్తూ.."సౌత్ కంటెంట్‌కి, సౌత్ స్టార్స్‌కి ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే.. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై వారికున్న ప్యాషన్‌, వృతిపరమైన నిబద్ధత అపారమైనది" అని పోస్ట్ చేసింది. 
 
ఇదే పోస్ట్‌లో "బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి" అంటూ పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments