Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ తర్వాత.. చరణ్‌ తోనే సినిమా, ఎవరు?

Webdunia
శనివారం, 9 మే 2020 (11:35 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ప్రధమార్థంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
 
అయితే... నాగ్ అశ్విన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ప్రభాస్‌తో చేస్తున్న సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. 
 
ఇంతకీ చరణ్‌తో ఎలాంటి సినిమా అంటే.. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ అని సమాచారం. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అశ్వనీదత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ.. ఇప్పటివరకు సెట్ కాలేదు. ఈసారి మాత్రం ఈ సీక్వెల్ పక్కా అంటున్నారు అశ్వనీదత్. చరణ్‌తో నాగ్ అశ్విన్ మూవీ పక్కా అంటున్నారు. అయితే.. అది జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అవుతుందా..? లేక వేరే కథతో సినిమా తీస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments