వినాయక్ శీనయ్యను దిల్ రాజు ఆపేశారా? ఎందుకని?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (13:37 IST)
డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా నరసింహారావు దర్శకత్వంలో శీనయ్య అనే సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. సక్సస్‌ఫుల్ మూవీస్ అందించిన వినాయక్ హీరోగా సినిమా అనగానే అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఆసక్తి ఏర్పడింది. అయితే... కొంత షూటింగ్ చేసిన తర్వాత అప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ చూసుకుంటే.. సరిగా రాలేదనిపించడంతో ఆపేసారు. దీంతో ఈ మూవీ ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి.
 
ఈ సినిమా ప్రస్టేజీయస్‌గా తీసుకున్న వినాయక్ పరుచూరి బ్రదర్స్‌ను రంగంలోకి దింపారు. కథపై మళ్లీ కసరత్తు చేసారు. పరుచూరి బ్రదర్స్ సలహాలు సూచనలతో కొన్ని మార్పులుచేర్పులు చేసారు. ఇప్పుడు బాగానే ఉంటుందనిపించి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసారు. షూటింగ్ కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
 
అయితే... తాజాగా జరిగిన షూటింగ్ కూడా దిల్ రాజుకు సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడితో ఆపేస్తున్నట్టు టీమ్ మెంబర్స్ అందరికీ చెప్పారని సమాచారం. దీంతో టీమ్ అంతా వేరే ప్రాజెక్ట్‌కి షిప్ట్ అయినట్టు టాక్. వినాయక్ దర్శకుడిగా తదుపరి చిత్రం కోసం కథపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరి... వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడో..? ఏ నిర్మాత ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments