Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక్ శీనయ్యను దిల్ రాజు ఆపేశారా? ఎందుకని?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (13:37 IST)
డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా నరసింహారావు దర్శకత్వంలో శీనయ్య అనే సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. సక్సస్‌ఫుల్ మూవీస్ అందించిన వినాయక్ హీరోగా సినిమా అనగానే అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఆసక్తి ఏర్పడింది. అయితే... కొంత షూటింగ్ చేసిన తర్వాత అప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ చూసుకుంటే.. సరిగా రాలేదనిపించడంతో ఆపేసారు. దీంతో ఈ మూవీ ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి.
 
ఈ సినిమా ప్రస్టేజీయస్‌గా తీసుకున్న వినాయక్ పరుచూరి బ్రదర్స్‌ను రంగంలోకి దింపారు. కథపై మళ్లీ కసరత్తు చేసారు. పరుచూరి బ్రదర్స్ సలహాలు సూచనలతో కొన్ని మార్పులుచేర్పులు చేసారు. ఇప్పుడు బాగానే ఉంటుందనిపించి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసారు. షూటింగ్ కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
 
అయితే... తాజాగా జరిగిన షూటింగ్ కూడా దిల్ రాజుకు సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడితో ఆపేస్తున్నట్టు టీమ్ మెంబర్స్ అందరికీ చెప్పారని సమాచారం. దీంతో టీమ్ అంతా వేరే ప్రాజెక్ట్‌కి షిప్ట్ అయినట్టు టాక్. వినాయక్ దర్శకుడిగా తదుపరి చిత్రం కోసం కథపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరి... వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడో..? ఏ నిర్మాత ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంబేలెత్తిస్తున్న భానుడు: ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments