Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక మందన్న బంపర్ ఆఫర్ వద్దనుకుందా? (video)

Webdunia
సోమవారం, 6 జులై 2020 (13:21 IST)
టాలీవుడ్ స్టార్ రష్మిక మందన్న బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అయితే రష్మికకు బాలీవుడ్‌లో ఓ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చినా.. ఎందుకో అంగీకరించలేదు. 
 
గతేడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. రీసెంట్‌గా అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ మంచి సక్సెస్ అందుకున్నాడు. 
 
అదే ఊపులో తెలుగులో హిట్టైయిన 'జెర్సీ' హిందీ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పాడు. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో ఈ సినిమాను అల్లు అరవింద్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. 
 
ఇక హిందీలో షాహిద్ కపూర్ సరసన రష్మిక మందన్నను ఎంపిక చేశారు. కానీ రష్మిక మందన్న ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా హిందీ రీమేక్ నుంచి తప్పుకుంది. మరి రష్మిక నో చెప్పిన పాత్రలో ఇంకెవ్వరు నటిస్తారో వేచి చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments