Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్శకుడు మోసం చేశాడంటున్న నయనతార...

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (13:39 IST)
అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈమె ఒకవైపు ప్రియుడుతో ప్రేమాయణం కొనసాగిస్తూనే, మరోవైపు వరుస చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "దర్బార్" చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు మురుగదాస్. ఈ చిత్రంలోని పాత్రపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 
 
12 యేళ్ల క్రితం సూర్య నటించిన చిత్రం గజినీ. ఈ చిత్రంలో తనను మోసం చేసినట్టుగానే ఇపుడు కూడా దర్బార్ చిత్రంలో మరుగదాస్ మోసం చేశారంటూ బోరున విలపిస్తోంది. దర్బార్ చిత్రంలో మెయిన్ హీరోయిన్ నయనతార అయినప్పటికీ రజనీ కుమార్తెగా నటించిన నివాదే థామస్‌కు ఇచ్చిన విలువలో సగం కూడా తనకు ఇవ్వలేదని, తనను ఓ జూనియర్ ఆర్టిస్టుగా చూపించారని ఈమె వాపోతోంది. 
 
ముఖ్యంగా, ఇక నయనతార అభిమానులు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో తన సత్తాను చాటి, కోట్లాది మంది అభిమానాన్ని పొందిన నయన్, అసలు ఇటువంటి సినిమాను ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న విమర్శలతో మరింత అశాంతికి గురవుతున్న నయన్, మురుగదాస్ 'గజినీ' సినిమాలో నటించి తప్పు చేసిన తాను, మరోసారి అతని సినిమాలో నటించేందుకు అంగీకరించి, తప్పు చేశానని, అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నానని అంటోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments