Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు సినిమాపై క్లారిటీ ఇచ్చిన బాబీ, ఇంతకీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

Webdunia
శనివారం, 23 మే 2020 (17:32 IST)
మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత స్పీడు పెంచి దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటివరకు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే...  ఈ సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పినట్టు చిరంజీవి ఇటీవల ప్రకటించారు. అందులో సాహో డైరెక్టర్ సుజిత్‌తో ఓ సినిమా, వెంకీమామ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఓ మూవీ, మెహర్ రమేష్‌ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్టు చిరంజీవి తెలియచేసారు. అయితే... చిరంజీవితో చేయనున్న సినిమా గురించి ఫస్ట్ టైమ్ డైరెక్టర్ బాబీ స్పందించారు.
 
ఇంతకీ ఏం చెప్పారంటే... చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుందన్నారు. చిరంజీవి గారికి కథ చెప్పగానే.. వెంటనే ఈ సినిమా మనం చేద్దామన్నారు.

ఓ కొత్త తరహా కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా ఈ సినిమాని తెరకెక్కిస్తానన్నారు బాబీ. ఈ మూవీని ఎవరు నిర్మించనున్నారు..? అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. ఎప్పుడు స్టార్ట్ కానుంది..? ఎవరు నిర్మిస్తారు..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments