Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టిన దిల్ రాజు... ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడో తెలుసా..?

Webdunia
గురువారం, 4 జులై 2019 (21:49 IST)
అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల‌ని ట్రై చేస్తున్నారు. క‌మ‌ల్ - శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందే భార‌తీయుడు 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వాల‌నుకున్నారు. ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. కానీ... ఎందుక‌నో దిల్ రాజు త‌ప్పుకున్నారు. అయినా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ఆప‌లేదు. ఎఫ్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని.. బోనిక‌పూర్‌తో క‌లిసి ఎఫ్ 2 సినిమాని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని అఫిషియ‌ల్‌గా గ‌తంలో ఎనౌన్స్ చేసారు. 
 
ఇప్పుడు ఈ సినిమా కంటే ముందుగానే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు దిల్ రాజు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన భారీ చిత్రం ఎవ‌డు. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మించారు. 2014లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. `హేట్ స్టోరీ4` ద‌ర్శ‌కుడు మిలాప్ జ‌వేరి, నిఖిల్ అద్వానీ ఇద్ద‌రు ఎవ‌డు సినిమాని చూసార‌ట‌. 
 
ఈ సినిమా న‌చ్చ‌డంతో దిల్ రాజుని కాంటాక్ట్ చేసార‌ట‌. బాలీవుడ్ రీమేక్‌ని దిల్ రాజు, నిఖిల్ అద్వానీ సంయుక్తంగా నిర్మిస్తార‌ట‌. మిలాప్ జ‌వేరి డైరెక్ట్ చేస్తార‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాత ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర్ని ఎంపిక చేయాలి అనేది ఆలోచిస్తారట‌. ఈ విధంగా ఎవ‌డు సినిమాతో దిల్ రాజు బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments