Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్ తీసుకుని చెక్కేసిన భామ.. కేసు పెట్టిన చిత్ర యూనిట్ (Video)

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:47 IST)
తెలుగులో వచ్చిన చిత్రం "అర్జున్ రెడ్డి". విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, హీరోయిన్‌గా ఉత్తరాది భామ షాలిని పాండే. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో బోల్డ్‌గా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 
 
ఈ కోవలోనే తమిళంలో హీరో విజయ్ ఆంటోనీతో నటించేందుకు అంగీకరించి, అడ్వాన్స్‌ తీసుకుని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. ఆ తర్వాత ఆమె స్పందించడం లేదు. కొన్ని రోజులు సజావుగా సెట్స్‌కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. షాలినీపై అంతకుముందే తెలుగు, తమిళ నిర్మాతల మండలిలోనూ ఫిర్యాదు చేశారు. 
 
మరోవైపు, షాలినీ ఇటీవలే బాలీవుడ్‌లో అదిరిపోయే చాన్సును కొట్టేసింది. నవతరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన 'జయేశ్ భాయ్ జోర్దార్' అనే అనే చిత్రంలో నటించేందుకు సమ్మతం తెలిపింది. బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందన్న అహంకారంతో ఈ విధంగా ప్రవర్తిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments