Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు మరో మల్టీస్టారర్, మరో హీరో ఎవరో తెలుసా?

Webdunia
శనివారం, 9 మే 2020 (15:53 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఓ మల్టీస్టారర్. ఈ సినిమా తర్వాత మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ లోనటించనున్నారు.
 
ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా కూడా ఓ మల్టీస్టారరే. అయితే.. ఇప్పుడు తాజాగా మరో మల్టీస్టారర్లో కూడా చిరు నటించనున్నారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే... లూసీఫర్ తర్వాత చిరంజీవి బాబీ డైరెక్షన్లో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు.
 
బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాబీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు. అయితే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరో కూడా ఉన్నాడట. ఇంతకీ.. మరో హీరో ఎవరంటే దగ్గుబాటి రానా అని సమాచారం. 
 
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి - రానా కాంబినేషన్లో రూపొందే భారీ మల్టీస్టారర్ కథ చాలా కొత్తగా ఉంటుందని.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఉంటుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments