Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా నష్టపోయిన "బాహుబలి" నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

'బాహుబలి' నిర్మాతలు భారీగా నష్టపోయారు. అదేంటి.... 'బాహుబలి' చిత్రం కనకవర్షం కురిపిస్తే.. ఆ చిత్ర నిర్మాతలు ఎలా నష్టపోతారన్నదే కదా మీ సందేహం. నిజమే.. ఇక్కడ 'బాహుబలి' చిత్ర నిర్మాతలు విపరీతమైన నష్టాలు అ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:20 IST)
'బాహుబలి' నిర్మాతలు భారీగా నష్టపోయారు. అదేంటి.... 'బాహుబలి' చిత్రం కనకవర్షం కురిపిస్తే.. ఆ చిత్ర నిర్మాతలు ఎలా నష్టపోతారన్నదే కదా మీ సందేహం. నిజమే.. ఇక్కడ 'బాహుబలి' చిత్ర నిర్మాతలు విపరీతమైన నష్టాలు అనుభవించారు. దీంతో వారు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దీని వెనుక గల కారణాలను పరిశీలిస్తే... 
 
'బాహుబలి ది కంక్లూజన్' ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. దీంతో ఫస్ట్ పార్ట్‌ను ఉత్తరాదిన దాదాపు 1000 థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. 'బాహుబలి-1' చూసినవారికి 'బాహుబలి-2' టికెట్లు వచ్చేలా ఆఫర్ కూడా ప్రకటించారు. అయితే రి రిలీజ్ పెద్ద ప్లాప్ అయింది. ప్రేక్షకులు రాక థియేటర్స్ అన్నీ వెలవెలబోతున్నాయి.
 
'బాహుబలి' పార్ట్ 1 ఇప్పటికే అనేకసార్లు టీవీలో రావడం, ఆన్‌లైన్లో కూడా అందుబాటులో ఉండటం, ఇప్పటికే సినిమా డివీడీల రూపంలో కూడా రావడంతో ఎవరూ మళ్లీ భారీగా డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా థియేటర్స్ అద్దె, ఇతర ఖర్చుల రూపంలో భారీగానే నష్టం వచ్చిందట. 
 
కాగా, ఈనెల 28న 'బాహుబలి పార్ట్ 2- ది కంక్లూజన్' రిలీజ్ కానుంది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రాన్ని 6500 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రూ.1000 వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments