Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ కుర్రాడిని రేష్మి పెళ్లి చేస్కుంటుందా... గింజుకుంటున్న యాంకర్...

నేను విశాఖలోనే సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల గుసగుసలు పోతున్నాయి. రేష్మి చెప్పిన మాటలను చూస్తుంటే ఆమె విజయవాడకు చెందిన ఓ కుర్రాడిని పెళ్లి చేస్కుంటుందంటూ చెప్పుకుంటున్నారు. ఆ విజయవాడ కుర్రాడు ఎవరయ్యా అంటే స

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (14:47 IST)
నేను విశాఖలోనే సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల గుసగుసలు పోతున్నాయి. రేష్మి చెప్పిన మాటలను చూస్తుంటే ఆమె విజయవాడకు చెందిన ఓ కుర్రాడిని పెళ్లి చేస్కుంటుందంటూ చెప్పుకుంటున్నారు. ఆ విజయవాడ కుర్రాడు ఎవరయ్యా అంటే సుడిగాలి సుధీర్ అంటున్నారు. ఎటొచ్చీ మళ్లీ సుడిగాలి దగ్గరే ఆగుతున్నారు. 
 
ఆమధ్య కూడా జబర్దస్త్ యాంకర్ రష్మికి, ఆ కార్యక్రమంలో పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్‌కు అఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు. తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. ఈ అఫైర్ వ్యవహారంపై సుడిగాలి సుధీర్ స్పందించాడు.
 
తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. కేవలం స్కిట్లో నవ్వులను ఎక్కువుగా జోడించడానికి తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. వీటి వల్ల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకూ ఎవరూ పిల్లనివ్వడానికి కూడా ముందుకు రావట్లేదని నవ్వేశాడు.
 
కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులతో తనకు, రష్మీకి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. నిజానికి చెప్పాలంటే తన జీవితంలో ఇంతకుముందే ఒకసారి లవ్ ఫెయిల్ అయిందని, తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా లేదని వివరించాడు. ఇక తరచూ బ్రేక్ తీసుకుంటానని, రెండు రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటానని వివరించాడు. 
 
రేష్మి కూడా విశాఖలో సెటిలవుతానంటే ఆంధ్రకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అర్థం కాదని అంటోంది. విశాఖలో సెటిలవుతానని చెప్పినందుకు ఇంత రాద్ధాంతమా అని గింజుకుంటోంది. సెలబ్రిటీలు ఏం మాట్లాడినా దాన్ని తీగలాగి డొంకంతా పంచడం మామూలే కదా.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments