Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు మూవీలో విజయ్ హీరోయిన్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:20 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి మహేష్ బాబు పరశురామ్ చెప్పిన కథకు ఓకే చెప్పారు.
 
కరోనా రాకపోతే ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. కరోనా తగ్గే వరకు షూటింగ్‌కి రాలేనని మహేష్ చెప్పడంతో ఎప్పటి నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేని పరిస్థితి.
 
 ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కియారా కాదు.. కీర్తి సురేష్ నటించనున్నట్టు టాక్ వచ్చింది. కీర్తి సురేష్‌ నటించడం అనేది దాదాపు ఖాయం అని టాక్.
 
ఇదిలా ఉంటే.. ఇందులో మరో కథానాయిక పాత్ర కూడా ఉందట. ఆ పాత్రకు బాలీవుడ్ భామ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న అనన్య పాండే అయితే కరెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారట. పరశురామ్ ఫుల్ స్రిప్ట్ రెడీ చేసి మహేష్ ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. అనన్య పాండేకు ఈ మూవీలో నటించే అవకాశం వస్తే... లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments