Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి తర్వాత బన్నీని టార్గెట్ చేసిన ఆ దర్శకుడు?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (08:55 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ దర్శకుల్లో కొరటాల శివ. సామాజిక నేపథ్యంతో చిత్రాలు తీస్తూ ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో "ఆచార్య" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాయల భూముల స్కామ్‌లను ఈ చిత్రంలో చూపించనున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ చిత్రం తర్వాత కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
 
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో ఎప్పటి నుంచో ఉంది. అది ఎట్టకేలకు ఇప్పుడిది కార్యరూపం దాల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. 
 
బలమైన సామాజిక సందేశమున్న కథాంశంతోనే కొరటాల తనదైన శైలిలో ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. 
 
కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్‌ లెక్కల మాస్టారు సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య'ను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే వీళ్లిద్దరి కలయికలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments