Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కి నిర్మాతలు కావాలి, రంగంలోకి దిగిన రామ్ చరణ్‌

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కరోనా రాకుండా ఉంటే, ఈపాటికే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలావుంటే.. అఖిల్ - సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.
 
దీనికి కారణం ఏంటంటే... ఈ మూవీకి దాదాపు 40 కోట్లు బడ్జెట్ కావాలట. ముందుగా ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన క్రిష్ నిర్మించాలి అనుకున్నారు కానీ.. అఖిల్ పైన అంత బడ్జెట్ వర్కవుట్ కాదని తప్పుకున్నారు.
 
 ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ మూవీని నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. వాళ్లు కూడా ఆలోచనలోపడ్డారని టాక్. కథ నచ్చింది... డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెడీగా ఉన్నారు కానీ.. ఈ సినిమాకి డబ్బులు పెట్టే నిర్మాతే లేడు.
 
అందుకనే అసలు విషయం తెలుసుకున్న రామ్ చరణ్... అఖిల్ కోసం రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాని సెట్ చేసే పనిలోనే ఉన్నారని... త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ వస్తుందని తెలిసింది. మరి.. అఖిల్ కోసం రిస్క్ చేసే ఆ ప్రొడ్యూసర్ ఎవరో..? ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments