Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత బయోపిక్.. సీన్లోకి వచ్చిన దేవసేన

దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా జయలలిత పాత్రలో ఎవరు

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (18:44 IST)
దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా  రెండు సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా జయలలిత పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే విషయంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.


అమ్మ పాత్రలో త్రిష, నయనతార, కీర్తి సురేష్‌ల మధ్య పోటీ వుంటుందని కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగింది. అయితే జయలలిత పాత్రలో... అరుంధతి, దేవసేన, భాగమతి అంటే అనసూయ కనిపిస్తుందని టాక్ వస్తోంది.  
 
వెండితెరపై అందాల కథానాయికగా, తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన శక్తిమంతమైన నాయకురాలిగా జయలలిత ప్రజల మనసులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అన్నివర్గాల ప్రజలచేత అమ్మ అని పిలుచుకున్న జయలలిత బయోపిక్‌ను రూపొందించేందుకు ఎ.ఎల్. విజయన్, ప్రియదర్శన్, భారతీరాజా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు వున్నారు. 
 
భారతీరాజా చకచకా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. జయలలిత బయోపిక్ కోసం భారతీ రాజా ఐశ్వర్యరాయ్‌ని, అనుష్కను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ఓకే అంటే లక్కేనని, కానీ ఆమె కుదరంటే మాత్రం అనుష్కను తీసుకోవాలని భారతీ రాజా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను డిసెంబరులో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పురట్చితలైవి, అమ్మ అనే పేర్లు ఈ సినిమాకు పరిశీలనలో వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments