కె.కవిత చొరవ - నిజామాబాద్‌ ఆస్పత్రికి యువరాజ్ సింగ్ వితరణ

Webdunia
బుధవారం, 28 జులై 2021 (17:06 IST)
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోమారు పెద్ద మనసు చాటుకున్నారు. కేన్సర్ బారినపడిపూర్తిగా కోలుకున్న ఆయన.. ఇపుడు ఇతరులకు సేవ చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రూ.2.50 కోట్ల విలువ చేసే పడకలను సమకూర్చారు. ఎమ్మెల్సీ కె.కవిత తీసుకున్న చొరవ కారణంగా యువరాజ్ సింగ్ సాయం చేశారు. మొత్తం 120 ఐసీయూ పడకలను ఆస్పత్రికి సమకూర్చేందుకు యువరాజ్ సింగ్ ముందుకువచ్చారు. ఈ పడకలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం ప్రారంభించగా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో యువరాజ్ పాల్గొన్నాడు.
 
కాగా, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి దేశ స్దాయిలో గుర్తింపు సాధించింది. కోవిడ్ సమయంలో కరోనా పేషెంట్లకు వైద్య సిబ్బంది చేసిన సేవలను క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తించాడు. మరింత మెరుగైన వైద్యం అందిచేందుకు వీలుగా తన ఫౌండేషన్ తరపున రూ.2.5 కోట్లు విలువ చేసే 120 ఐసీయూ బెడ్లను అందచేశాడు. 
 
ఈ మేరకు యూవీకేన్ ఫౌండేషన్ సభ్యులు జిల్లా ఆసుపత్రిలోని రెండు వార్డులలో ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ చాలామంది జీవితాల్లో చీకట్లు నింపిందని.. థర్డ్‌వేవ్‌లో అలాంటి విపత్కర పరిస్థితులు రావొద్దనే తన ఫౌండేషన్‌తో ఈ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు యువరాజ్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments