Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 నుంచి షర్మిల పాదయాత్ర ... 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:25 IST)
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుటనున్నారు ఈ నెల 20వ తేదీన చేవెళ్ల మండలం శంకరపల్లి నుంచి ఆమె తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు.
 
మొత్తం 400 రోజులపాటు జరిగే పాదయాత్ర 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందని వివరించారు. ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 
 
అలాగే, ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ ఉంటే అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. 20న ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారని వైతెపా చేవెళ్ల పార్లమెంటు కన్వీనర్‌ కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments