Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 నుంచి షర్మిల పాదయాత్ర ... 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:25 IST)
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుటనున్నారు ఈ నెల 20వ తేదీన చేవెళ్ల మండలం శంకరపల్లి నుంచి ఆమె తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు.
 
మొత్తం 400 రోజులపాటు జరిగే పాదయాత్ర 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందని వివరించారు. ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 
 
అలాగే, ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ ఉంటే అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. 20న ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారని వైతెపా చేవెళ్ల పార్లమెంటు కన్వీనర్‌ కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments