తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యం.. నేడు నల్గొండలో వైఎస్‌ షర్మిల దీక్ష

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (12:55 IST)
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. నిరుద్యోగ వారం- నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా YSRTP అధ్యక్షురాలు వైయస్. షర్మిల నేడు.. నల్గొండ జిల్లా చండూరు (మం) పుల్లెంలలో దీక్ష చేపట్టనున్నారు. 
 
అందులో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పాదయాత్రగా శిబిరాన్ని చేరుకుని సాయంత్రం ఆరు గంటల వరకు నిరాహార దీక్ష చేస్తారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి వెల్లడించారు.
 
వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధినేత్రి వైఎస్‌ షర్మిల దేశాంగాణలోని వివిధ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు షర్మిల. 
 
ఇక మంగళవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం దీక్ష ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు విరమిస్తారని సన్నాహక కమిటీ కన్వీనర్‌ ఇరుగు సునీల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments