Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు కొండత అండగా ఉంటాం : వైఎస్.షర్మిల

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (14:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ పుత్రిక వైఎస్. షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర నిరుద్యోగులకు ఓ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటామని ప్రకటించారు  
 
నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు.
 
శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్‌టీపీ అడహక్‌ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్‌ ఖాన్, కృష్ణమోహన్‌ తదితరులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ నెలలో షర్మిల 72 గంటల పాటు దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దారుణమన్నారు.
 
టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలోనే వరాలు కురిపించే సంస్కృతిని మానుకుని, బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్‌ క్యాలెండర్ రూపొందించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ సర్కారులో చలనం వచ్చి ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేవరకు షర్మిల ప్రతి మంగళవారం దీక్ష చేపడతారని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు తెలిపాయి.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments