Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (13:37 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై వారు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 
 
పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం 40 నుంచి 80 వేల క్యూసెక్కుల‌కు పెంచుతుండ‌డం ప‌ట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజ‌నేయస్వామి, ఏలూరి సాంబశివరావులు ఈ లేఖలో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.
 
తెలంగాణ‌, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల వ‌ల్ల త‌మ జిల్లాకు న‌ష్టం క‌లుగుతోంద‌ని, ఆ ప్రాజెక్టుల‌ను నిలిపేయాలని కోరారు. ఎత్తిపోతల పథకాన్ని విస్తరించడం వల్ల ప్రకాశం జిల్లాకు నీరు అందదని తెలిపారు. ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.
 
మరోవైపు, ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అలాగే కృష్ణా ట్రైబ్యునల్ కూడా తీవ్ర హెచ్చరికలు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments