Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (13:37 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై వారు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. 
 
పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం 40 నుంచి 80 వేల క్యూసెక్కుల‌కు పెంచుతుండ‌డం ప‌ట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజ‌నేయస్వామి, ఏలూరి సాంబశివరావులు ఈ లేఖలో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.
 
తెలంగాణ‌, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల వ‌ల్ల త‌మ జిల్లాకు న‌ష్టం క‌లుగుతోంద‌ని, ఆ ప్రాజెక్టుల‌ను నిలిపేయాలని కోరారు. ఎత్తిపోతల పథకాన్ని విస్తరించడం వల్ల ప్రకాశం జిల్లాకు నీరు అందదని తెలిపారు. ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.
 
మరోవైపు, ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అలాగే కృష్ణా ట్రైబ్యునల్ కూడా తీవ్ర హెచ్చరికలు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించింది. 
 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments