Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో విషాదం.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:09 IST)
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. డాక్టర్ పూర్ణ చందర్(28) గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందారు. బుధవారం ఉదయం డాక్టర్ పూర్ణ చందర్ తన విధులు ముగించుకున్న అనంతరం గాంధీ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి బయటకు వస్తుండగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది తక్షణమే ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయినప్పటికీ అతను వైద్యానికి సహకరించలేదు. గుండెపోటుతో పూర్ణ చందర్ మరణించినట్లు సీనియర్ వైద్యులు నిర్ధారించారు.
 
డాక్టర్ పూర్ణచందర్ జనరల్ సర్జరీలో ఇటీవలే సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం పూర్ణ చందర్ గాంధీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే డాక్టర్ పూర్ణ చందర్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తోటి జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఛాతీలో నొప్పి వస్తుందని, కడుపుంతా వికారంగా ఉన్నట్లు పూర్ణచందర్ తెలిపినట్లు జూడాలు పేర్కొన్నారు. అందుకోసం మెడిసిన్స్ వేసుకున్నాడని, బుధవారం మళ్లీ విధుల్లో చేరారని జూడాలు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments