Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో విషాదం.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:09 IST)
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. డాక్టర్ పూర్ణ చందర్(28) గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందారు. బుధవారం ఉదయం డాక్టర్ పూర్ణ చందర్ తన విధులు ముగించుకున్న అనంతరం గాంధీ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి బయటకు వస్తుండగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది తక్షణమే ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయినప్పటికీ అతను వైద్యానికి సహకరించలేదు. గుండెపోటుతో పూర్ణ చందర్ మరణించినట్లు సీనియర్ వైద్యులు నిర్ధారించారు.
 
డాక్టర్ పూర్ణచందర్ జనరల్ సర్జరీలో ఇటీవలే సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం పూర్ణ చందర్ గాంధీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే డాక్టర్ పూర్ణ చందర్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తోటి జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఛాతీలో నొప్పి వస్తుందని, కడుపుంతా వికారంగా ఉన్నట్లు పూర్ణచందర్ తెలిపినట్లు జూడాలు పేర్కొన్నారు. అందుకోసం మెడిసిన్స్ వేసుకున్నాడని, బుధవారం మళ్లీ విధుల్లో చేరారని జూడాలు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments