Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వలసలు: రేవంత్‌తో ధర్మపురి సంజయ్ భేటీ

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (19:07 IST)
టీఆర్ఎస్, బీజేపీల నుండి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతానన్నారు.
 
రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మాట్లాడిన సంజయ్..తన తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని చెప్పారు. కానీ అది కండువా కాదు.. గొడ్డలి అని తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్‌తో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీయే కాదన్నారు. కడుపులో కోపం ఉన్నా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే.. తనకేంటి అని అన్నారు.
 
బీజేపీకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు. బీజేపీని వీడడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాటి వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు. మరో బీజేపీ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు కూడా ఆ పార్టీని వీడనున్నారు. రేవంత్‌తో కలిసి టీడీపీలో పనిచేశానని.. మంచిరోజు చూసి.. నియోజక వర్గంలో సభ పెట్టి కాంగ్రెస్ లో చేరతామన్నారు.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments