Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం సాయంత్రం సాయంత్రం ప్రారంభ కార్యక్రమం కన్నులపండువగా జరుగనుంది.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (11:24 IST)
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం సాయంత్రం సాయంత్రం ప్రారంభ కార్యక్రమం కన్నులపండువగా జరుగనుంది. ప్రారంభ వేడుకల కోసం ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదికను కళ్లు చెదిరేలా సుందరీకరించారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మొదలయ్యే ప్రతిష్టాత్మక సాహితీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరవుతున్నారు.
 
ఈ మహాసభలు ఈనెల 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు.. తెలుగు విశ్వవిద్యాలయం, లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, రవీంద్రభారతి, లలిత కళాతోరణం, తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
తెలుగు భాషా సాహిత్యంలో తెలంగాణ కవులు, రచయితల పాత్రపై విస్తృతంగా చర్చిస్తారు. తెలంగాణ పద్య కవితా సౌరభం, వచన కవితా వికాసం, కథ, నవలా సాహిత్యం, తెలంగాణ విమర్శ- పరిశోధన అంశాలపై సదస్సులు, తెలంగాణలో తెలుగు భాష, అష్టావధానం, పద్యకవి సమ్మేళనం, జంట కవుల అష్టావధానం, బృహత్ కవి సమ్మేళనం లాంటి కార్యక్రమాలను ఐదురోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments