Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే ‌సౌండ్‌ ఎఫెక్ట్.. మహిళకు బ్రెయిన్ స్ట్రోక్‌ - మృతి

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (13:45 IST)
తెలంగాణా రాష్ట్రంలో డీజే సౌండ్ ఎఫెక్ట్‌కు మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ శబ్దం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. ఖమ్మం జిల్లాలోని నగర శివారు అల్లీపురంలో జరిగింది. 
 
మృతురాలి బంధువుల కథనం ప్రకారం... స్థానికంగా నివసించే పెనుగూరి రాణి(30) గురువారం చింతకాని మండలం సీతంపేటలో బంధువు వివాహ వేడుకలో కుటుంబంతో కలిసి పాల్గొంది. పెళ్లి కొడుకుతో తిరిగి ఇంటికి వస్తూ అల్లీపురంలో జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా నృత్యం చేసింది. 
 
ఈ క్రమంలో డీజే శబ్దానికి తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయిన ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. డీజే శబ్ధాల ధాటికి ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారని బంధువులు చెప్పారు. 
 
రాణి స్వగ్రామం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం. దివ్యాంగుడైన భర్త ఉప్పలయ్య, కుమార్తెలు అమూల్య, అంజలితో కలిసి తన పుట్టిల్లు అల్లీపురంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రాణి మృతితో కుమార్తెలు ఆదరవు కోల్పోయారని బంధువులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments