Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం: రెండో డోస్ వేసుకున్నా..?

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (22:17 IST)
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తెలంగాణలో తాజాగా నలుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకి పెరిగింది.  
 
కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13, హన్మకొండ జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. 
 
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతోంది. కర్ణాటకలోనూ మరో ఐదు కేసులు వెలుగుచూశాయి. వీరందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇప్పటివరకు మహారాష్ట్రలో 32, రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కర్ణాటకలో 8, తెలంగాణలో 7, కేరళలో 5, గుజరాత్ లో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1, చత్తీస్ గఢ్ లో 1, తమిళనాడులో 1 ఒమిక్రాన్ కేసును గుర్తించారు. ఈ క్రమంలో, దేశంలో కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసుల సంఖ్య 87కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments