Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (13:46 IST)
భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మూడు రోజులు ఇంట్లోని సంపులో భార్య మృతదేహాన్ని దాచి శవాన్ని మాయం చేసేందుకు విఫలయత్నం చేసి దొరికిపోయాడు. వివరాలు పరిశీలిస్తే షాజియాబేగం మియాపూర్ సమీపంలోని హఫీజ్ పేట్‌కు చెందిన తాజ్‌తో ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. 
 
ఈ దంపతులకు ముగ్గురు మగపిల్లలు సంతానం కలిగారు. వీరికి ఆరేళ్ల తహ, నాలుగేళ్ల తల్హా, రెండేళ్ల ఇబ్రహీంలు ఉన్నారు. ఇటీవల కాలంలో కాపురంలో కలతలు బయలేగాయి... భర్త తాజ్, అత్తింటివారంతా షాజియాను వేధింపులకు గురిచేసినా ఏనాడూ పుట్టింటివారికి చెప్పుకునేది కాదు ఈ ఇల్లాలు. శారీరకంగా, మానసికంగా హింసించినా ఓర్పుతో అన్నీ భరించింది షాజియా. 
 
మూడ్రోజుల క్రితం షాజియాబేగంపై కత్తులతో దాడి చేసి.. ఆమెని చంపి ఇంట్లోని నీళ్ల సంపులో పడేశారని ఆరోపిస్తున్నారు హతురాలి బంధువులు.నీళ్ల సంపులో ఉన్న షాజియాబేగం మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి.. పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. షాజియా బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షాజియాది హత్యా.. లేక ప్రమాదవశాత్తూ నీటిలో సంపులో పడి చనిపోయిందా అనేది వైద్యులిచ్చే పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని చెప్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments