వివాహేతర సంబంధానికి భర్త అడ్డు.. ప్రియుడితో కలిసి చంపేసింది..!

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (19:03 IST)
తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి, ముత్యాలు భార్యభర్తలు. అయితే నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం ముత్యాలు (28) కు తెలిసి కదలించాడు. దాంతో తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన ఇరువురు ముత్యాలును హత్య చేయాలని పథకం పన్నారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 7న ముత్యాలు కూలి పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి ఇంట్లో నిద్రించాడు. అదే అదనుగా భావించిన నాగరాణి, నవీన్ లు ముత్యాలు మెడకు చున్నీ బిగించి హత్యచేశారు.

ఉదయం తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్టు ఒప్పుకొని పారిపోయింది.
 
దాంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments