Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగశిర కార్తె.. చేపలు తప్పకుండా తినాల్సిందేనా..? కారణం ఏంటి?

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (16:08 IST)
అసలు మృగశిర రోజు చేపలు ఎందుకు తినాలి.. అనే అనుమానం మీలో వుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం చదవండి మరి. సాధారణంగా మృగశిర కార్తీక వచ్చిదంటే చాలు పల్లెల్లో చెరువుల వద్ద సందడి కనిపిస్తుంటుంది. మృగశిర కార్తీక రోజు చేపలు తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదట. అందువలన ఆనాది కాలం నుంచి ఈ పద్ధతి అమలులో ఉంది.
 
చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతే కాకుండా వీటిని తినడం వలన అనేక వ్యాధులు దూరమవుతాయంటారు. అయితే ఎండకాలం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో శరీరంలో వేడి ఉండేందుకు చేపలు తింటారు. అంతే కాకుండా ఈ చేపలు గుండె జబ్బులు, ఆస్తమా పేషంట్లకు మంచి ఔషదంగా చెప్పవచ్చు.
 
ఇక ఈ రోజు చేప మందు కూడా పంపిణీ చేస్తుంటారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె 15 రోజుల పాటు ఉంటుంది. అలాంటి సమయంలో చేపలు తింటే.. వ్యాధులు దూరమవుతాయనేది ప్రజల బలమైన విశ్వాసం.
 
ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభం అయ్యింది. కృత్తిక‌, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగ‌శిర‌ కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. 
 
వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. మరోవైపు ఇవాళ హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లన్నీ పుల్ రద్దీతో దర్శనమిస్తున్నాయి. 
 
మృగశిర కార్తె రాకతో వర్షాలు పడుతుంటాయి. ఫలితంగా కొన్ని సీజనల్ వ్యాధలు ప్రబలే అవకాశం ఉంటుంది. తద్వారా కాస్త ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు తింటుటారానే వాదన ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments