పెట్రోల్ బంకులో వింత.. డీజిల్ స్థానంలో నీళ్లు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (18:27 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మండిపోతున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చమురు ధరలు సెంచరీ కొట్టాయి. ఇలా పెరిగిపోయిన ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు, పెట్రోల్ బంకు యజమానులు కూడా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వాహనదారులను మోసం చేస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్‌‍లో కల్తీకి పాల్పడుతూ మోసం చేస్తున్నారు. ఇపుడు అంతకుమించిన మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట హుజూర్ నగర్‌లోని ఓ పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి తన వాహనానికి డీజిల్ పోయించుకునేందుకు పెట్రోల్ బంకుకు వెళ్లాడు. డీజిల్ కొట్టిస్తున్న సమయంలో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తున్న సమయంలో ఆవిరి వస్తుంది. కానీ, ఇక్కడ అలాంటిదేమీ రాకపోవడంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. దీంతో ఆ వ్యక్తి తన వాహనాన్ని పక్కనబెట్టి వాటర్ బాటిల్ తీసుకొచ్చి అందులో డీజిల్ నింపాలని కోరాడు. దీనికి పెట్రోల్ బంక్ సిబ్బంది ససేమిరా అన్నారు. 
 
కానీ, ఆ వాహనదారుడు మాత్రం పట్టు విడవకపోవడంతో సిబ్బంది మరో మార్గం లేక ఆ బాటిల్‌లో డీజిల్ నింపగా, కేవలం మంచినీరు మాత్రమే వచ్చింది. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది చేస్తున్న అసలు మోసం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై సిబ్బందిని నిదీయడంతో వారు వింతగా సమాధానం చెప్పారు. అది మంచినీరు కాదని, డీజల్ రంగు మారిందని చెప్పాడు. ఇప్పటికే అనేక వాహనాలకు ఈ డీజిల్‌ను నింపినట్టు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments