Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యుబావి కేసు.. వరంగల్ కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (18:52 IST)
మృత్యుబావి కేసులో వరంగల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గొర్రెకుంటలో జరిగిన ఈ తొమ్మిది మంది హత్యలకు కారకుడైన సంజయ్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఒక హత్యకు కప్పిపుచ్చుకునేందుకు మరో తొమ్మిది మందిని హత్యలకు కారకుడైన సంజయ్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 
 
కాగా, మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులో పాడుబడిన బావిలో తొమ్మిది మందిని హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులందరికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్‌ వారు మత్తులోకి జారుకోవడంతో హత్య చేసి బావిలో పడేశాడు. ముందుగా మహిళ హత్యను కప్పిపుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో 9 మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 
 
అయితే కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన పనితనాన్ని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్టు నేరారోపణకు సంబంధించిన పత్రాలు దాఖలు చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడటంపై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ కేసుపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. కేసులు ఛేదించారు. అయితే 9 మందిని హత్య చేసింది సంజయ్‌ అని తేలింది. మక్సూద్‌ కుటుంబంతో ఉంటున్ను బుస్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంజయ్.. తనకు అడ్డు రావద్దని మక్సూద్‌ కుటుంబంతో పాటు సన్నిహితంగా ఉన్న బీహార్‌కు చెందిన యువకులను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments