Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులు ఇవ్వలేదని రాస్తారోకో చేసిన ఓటర్లు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (09:43 IST)
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలను అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ తమ పార్టీల అభ్యర్థుల విజయం కోసం చేసిన ప్రచారం ఇప్పటికే ముగిసిపోయింది. 
 
ఇపుడు వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రలోభాలకు తెరలేపారు. వాస్తవానికి హుజురాబాద్‌లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది..
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్‌లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట. మరికొంత మందికి మరిచారో మరి మళ్లీ వస్తారో తెలియదు. కానీ, ఈలోపే ఓటర్లు నిరసనకు దిగారు. తమకు డబ్బులు రాలేదని రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో, హుజురాబాద్ జమ్మికుంట రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులిచ్చి మరికొందరిని వదిలేశారని నినాదాలు చేస్తూ.. నిరసన తెలుపారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ బహిరంగ రహస్యమే అయినప్పటికీ ఇప్పుడు ఓటర్లు ఏకంగా ఆందోళనకు దిగడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. హుజురాబాద్‌లో డబ్బుల ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments