కేసీఆర్ గారూ.. ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో?: రాములమ్మ ఫైర్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:26 IST)
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం పేరుతో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేశారని మండిపడ్డారు. "టీఆరెస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ గారు అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లతో, కుట్రలతో అబద్ధపు దుష్ప్రచారాలతో ఎన్నో దుర్మార్గాలు చేశారు. 
 
ఆ తర్వాత చర్చలని చెప్పి ఆ పార్టీలను తెలంగాణ ఐక్యత పేరుతో విలీనం చేయించి, ఆ పార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిదే... తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే... ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి నేతలను బండకేసి కొడతానని... పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి తిట్టబట్టిన కేసీఆర్ గారు... తన సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అని చెప్పడం విడ్డూరం. 
 
అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో? సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్ గారు, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన టీఆరెఎస్ ఎమ్మెల్యేలపై కనీసం ఖండన చెయ్యకపోవడం గమనార్హం." అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalki 2 shoot: కల్కి 2 తాజా అప్ డేట్ - ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై సన్నివేశాల చిత్రీకరణ

Varalakshmi: వరలక్ష్మి ని చూసి బాలయ్య గారు ఊర్వశి శారద తో పోల్చారు : గోపీచంద్ మలినేని

బ్యాండ్ మేళం నుంచి ఎనర్జిటిక్ సాంగ్ తిప్పుకుంటన్నవ్ రిలీజ్

Trigun: త్రిగుణ్ హీరోగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకర్షిత చిత్రం ప్రారంభం

Anil Ravipudi : రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ జంట కిల్లర్ లో ఆసక్తికరంగా ఉంది : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

తర్వాతి కథనం
Show comments