పార్టీ జెండానే కాదు.. అన్నాడీఎంకే నాదే... నేను ఎవరికీ భయపడను : శశికళ

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:25 IST)
అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత మహిళా నేత శశికళ చెన్నైకు చేరుకున్నారు. నాలుగేళ్ళ తర్వాత తమిళ గడ్డపై అడుగుపెట్టిన ఆమెకు అభిమానులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె చెన్నైకు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ప్రజా జీవితంలో ఉంటానని, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. పైగా, తాను ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. 
 
తనను వ్యతిరేకించిన వారికి తనేమిటో ఇప్పటికే అర్థమైవుంటుందన్నారు. అన్నాడీఎంకే పార్టీ నేతలు వణికిపోతున్నారన్నారు. అన్నాడీఎంకే పార్టీ తనదేనని ప్రకటించారు. అమ్మ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు, శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం. 
 
శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండకూడని తమిళనాడు మంత్రులు పదేపదే చెబుతున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమె లెక్కచేయలేదు. తన కారు ముందుభాగంలో ఆ పార్టీ జెండాను ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments