Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుక్కి పీఠం అప్పగించి.. థ్యాంక్స్ గివింగ్ పార్టీలా కేసీఆర్ తప్పుకుంటారేమో?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (13:11 IST)
తెలంగాణలో సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం జరుగనుందని వార్తలు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సీఎం పోస్టుకు సంబంధించి రాములమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ పట్టాభిషేకంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. "ఒకవైపు కేటీఆర్‌ను తెలంగాణ కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి... గోదావరికి హారతులిచ్చి పూజాదికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను రేకెత్తించింది. 
 
మంగళవారం నాటి పర్యటనలో కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్‌లను కేసీఆర్ గారు ఆకాశానికెత్తేశారు. ఇన్నాళ్లూ కమిషన్ల రూపంలోనో... మరో రూపంలోనో తనను కనికరించిన ఆ ప్రాజెక్టుల వద్ద ఆయన పర్యటనలు, ఆలయాల్లో పూజలు చూస్తే... కొడుక్కి పీఠం అప్పగించి తాను నిష్క్రమించే ముందు ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా... లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నందుకు పాప పరిహారంగా నదీమ తల్లికి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆయన తీరు కనిపిస్తోంది. 
 
రైతాంగం, ప్రజల సంక్షేమం పట్ల సారుకు ఎంత చిత్తశుద్ది ఉందంటే... ఈ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులు ఉపాధి కోసం విజ్ఞప్తి చేసుకోవడానికి వస్తే కలుసుకునే సమయమే లేకుండె పాపం..." అంటూ విజయశాంతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments