ఇద్దరు సీఎంల మధ్య లోపాయికారీ ఒప్పందం: బీజేపీ

Webdunia
బుధవారం, 13 మే 2020 (08:17 IST)
పోతిరెడ్డిపాడుపై ఇద్దరు సీఎంల మధ్య లోపాయికారీ ఒప్పందం ఏముందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఉట్లపల్లిలో ఆయన బత్తాయి తోటలను పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. బత్తాయిలను ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేశారు.

పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్‌ వైఖరి విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్‌, కేసీఆర్‌లు అన్నదమ్ములంటూ ఏపీమంత్రి అనిల్‌ ప్రకటించడం.. ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు వీరిద్దరికీ పరోక్షంగా దగ్గరగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని లక్ష్మణ్‌ అన్నారు.

జీ పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో దీక్ష చేయనున్నట్లు బీజేపీ నేత డీకే అరుణ పేర్కొన్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపును ఆపలేని కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన దీక్ష చేపట్టనుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుసగా రూ.100 కోట్ల చిత్రాలు.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్‌కు కలిసొస్తుందా?

Lokesh Kanagaraj: ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ చిత్రం షూటింగ్

Dhanush: ధనుష్ కారాలోని కన్నమ్మా ఎన్ కన్నమ్మ పాట 1 మిలియన్ వ్యూస్ దాటింది

Ramya Krishna: అల్లు అర్జున్.. రాకా లో రమ్యక్రిష్ణ - ఏడు విదేశీ భాషలలో విడుదలకు సన్నాహాలు

Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ల చిత్రం ఓ..! సుకుమారి షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

తర్వాతి కథనం
Show comments