Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరసకు మామయ్య.. అయినా చాటింగ్ చనువు.. గర్భవతిని చేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (16:08 IST)
మెదక్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ మామయ్య బంధుత్వంతో ఓ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన పంజారాజు అనే పాతికేళ్ల యువకుడు ఆటో నడుపుకుంటున్నాడు. 
 
తనకు వరసకు కోడలు అయ్యే 16బాలికతో చనువు పెంచుకున్నాడు. బంధువు కదా అని ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో మరింత బరితెగించాడు. ఆ మైనర్ బాలికతో వాట్సాప్‌ చాటింగ్ చేస్తూ తన మాయ మాటలతో లొంగదీసుకున్నాడు.
 
మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని...పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి కాకుండానే మైనర్‌ బాలికను పలుమార్లు శారీరకంగా వాడుకోవడంతో ...ఆమె గర్భవతి అయింది. 
 
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెబితే ఏం చేస్తారోననే భయంతో రహస్యంగా ఉంచింది. అమ్మాయి ప్రవర్తనపై అనుమానం రావడంతో పాటు శరీరంలో మార్పును గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది.
 
దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే నిజాంపేట పోలీస్‌ స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కంప్లైంట్ ఆధారంగా రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం