Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పనీపాట లేదు, నీకు పిల్లనెవరు ఇస్తార్రా అన్నందుకు తండ్రిని, చిన్నాన్నను హత్య చేసాడు

murder
, శుక్రవారం, 12 ఆగస్టు 2022 (22:07 IST)
ఈరోజుల్లో అబ్బాయిలకు పెళ్లి కావడం అంటే మామూలు విషయం కాదు. అందునా పనిపాట లేకుండా ఆవారాగా తిరిగే వారికి పిల్లను ఎవరిస్తారు? ఇదే మాట ఆ యువకుడి తండ్రి, పినతండ్రి అన్నారు. అంతే... ఇద్దరినీ అత్యంత కిరాతకంగా హత్య చేసాడు ఆ యువకుడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామంలో 30 ఏళ్ల నితీష్ పనీపాట లేకుండా ఆవారా తిరుగుతున్నాడు. ఐతే తనకు పెళ్లి చేయాలంటూ తండ్రిపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నాడు. ఈ నేపధ్యంలో కుమారుడితో... నీవేమీ పనీపాట చేయడంలేదు. ఎవర్ని అడిగినా అదే మాట అంటున్నారు. నీకు పిల్లని ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అంటున్నారు. 

 
నీవేమీ చేయడంలేదు, పిల్లనెవరు ఇస్తారని అన్నాడు కన్నతండ్రి. అతడి మాటలతో తమ్ముడు కూడా వత్తాసు పలికాడు. అంతే... కోపంతో ఊగిపోతూ విచక్షణ కోల్పోయిన సతీష్.. తన తండ్రితో పాటు పినతండ్రిని అతి దారుణంగా హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 2022లో హైదరాబాద్‌లో 2,100 కోట్ల విలువైన నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు