Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ ఫొటోస్ దిగుతూ నీటిలో పడిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (07:46 IST)
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సోదరులిద్దరు సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ప్రమాదవశాత్తు తమ్ముడు నీటిలో పడిపోగా.. కాపాడేందుకు అన్న దూకాడు. వీరిలో అన్న గల్లంతు కాగా.. తమ్ముడిని పోలీసులు, నీటిపారుదల సిబ్బంది సురక్షితంగా కాపాడారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సోహైల్‌(25), మహ్మద్‌ సైఫ్‌ ఆదివారం సింగూరు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు మహ్మద్‌ సైఫ్‌ నీటిలోకి జారిపడ్డాడు. తమ్ముడిని రక్షించేందుకు నీళ్లలో దూకిన సోహైల్‌ గల్లంతయ్యాడు.

సైఫ్‌ ఈదుకుంటూ గేట్లవద్దకు చేరుకోవడంతో స్థానికులు, పుల్కల్‌ మండల పోలీసులు, నీటిపారుదలశాఖ సిబ్బంది తాడు సహాయంతో బయటికి లాగారు.

గల్లంతైన సోహైల్‌ ఆచూకీ కోసం మునిపల్లి, పుల్కల్‌ మండలాల పోలీసులు గత ఈతగాళ్లతో గాలించారు. ఆదివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదని మునిపల్లి ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments