Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ - ఆ టిక్కెట్ ధర తగ్గింపు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (09:21 IST)
మహిళలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ టిక్కెట్ ధర రూ.90గా ఉంది. దీన్ని ఇక నుంచి పది రూపాయలు తగ్గించి రూ.80కే విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు రూ.10 తగ్గింపుతో అందజేస్తున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఇకపై టీ24 టిక్కెట్‌ను రూ.80కే విక్రయిస్తారని, ఈ తగ్గింపు టిక్కెట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments