కాకినాడ రాఘవమ్మ చెరువు నీటిలో విషం... చనిపోయిన వేలాది చేపలు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (08:51 IST)
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం శివారులోని రాఘవమ్మ చెరువులో గుర్తు తెలియని దుండగులు విషం కలిపారు. దీంతో చెరువులోని వేలాది చేపలు చనిపోతున్నాయి. చనిపోయిన చేపలు నీటిపై తేలాడుతూ ఒడ్డుకు కొట్టుకునివస్తున్నాయి. దీంతో ఆక్వా రైతులకు లక్షలాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 
 
ఈ చెరువును కొందరు ఆక్వా రైతులు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చేపట్టారు. ఇపుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడంతో చెరువులోని చేపలు చనిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు బోరున విలపిస్తున్నారు. చెరువు నీటిలో విషం కలపడం వల్లే బాగా పెరిగిన చేపలన్నీ చనిపోయాయని రైతులు చెబుతున్నారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై చెరువు లీజుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వారిని గుర్తించిం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కాగా, చెరువులో విషం కలిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments