Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరెంట్ - నీళ్లు లేవనే వ్యాఖ్యలు అన్యాపదేశంగా వచ్చాయి... మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (07:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను కళ్లకు కట్టేలా తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవన్నారు. రోడ్లు అధ్వాన్నస్థితిలో ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలోని వైకాపా పాలకుల్లో కలకలం రేపాయి. ఏపీ మంత్రి మంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. దీంతో మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. 
 
క్రెడాయి ప్రాపర్టీ షోలో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధపెట్టి ఉండొచ్చన్నారు. అయితే, ఎవరినో కించపరచాలనే, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్‌ను సోదరుడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments