ఈటెలకు అన్నం పెట్టి అ.. ఆలు నేర్పింది సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (11:43 IST)
తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసకు గుడ్‌బై చెప్పిన ఈటల ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈటల మాటల తూటాలు పేల్చుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెలకు అన్నం పెట్టి.. అ, ఆలు నేర్పింది కేసీఆర్ అని.. కానీ కేసీఆర్ బతికుండగానే ఈటెల సీఎం కావాలని ప్రయత్నించారని హరీష్ ఆరోపించారు. 
 
ఈటెల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈటెల సీఎం కావాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడినప్పుడు… ఆ వ్యాఖ్యలను ఈటల ఎందుకు ఖండించలేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బతికుండగానే ఆయన పెట్టిన రైతుబంధు పథకం దండగ అని ఈటెల అన్నారని హరీష్ మండిపడ్డారు. 
 
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏ శక్తి కూడా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేదని చెప్పారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో 100 శాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. 
 
కాగా టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం హరీష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈటెలకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈటెలపై స్వయంగా హరీషే ఆరోపణలు చేయడంతో ఇరువర్గాల మధ్య రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments