Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటెలకు అన్నం పెట్టి అ.. ఆలు నేర్పింది సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (11:43 IST)
తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసకు గుడ్‌బై చెప్పిన ఈటల ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈటల మాటల తూటాలు పేల్చుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెలకు అన్నం పెట్టి.. అ, ఆలు నేర్పింది కేసీఆర్ అని.. కానీ కేసీఆర్ బతికుండగానే ఈటెల సీఎం కావాలని ప్రయత్నించారని హరీష్ ఆరోపించారు. 
 
ఈటెల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈటెల సీఎం కావాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడినప్పుడు… ఆ వ్యాఖ్యలను ఈటల ఎందుకు ఖండించలేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బతికుండగానే ఆయన పెట్టిన రైతుబంధు పథకం దండగ అని ఈటెల అన్నారని హరీష్ మండిపడ్డారు. 
 
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏ శక్తి కూడా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేదని చెప్పారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో 100 శాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. 
 
కాగా టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం హరీష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈటెలకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈటెలపై స్వయంగా హరీషే ఆరోపణలు చేయడంతో ఇరువర్గాల మధ్య రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments