Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి... ఢిల్లీ టూర్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (11:01 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్రంపై పోరాటానికి దిగనున్నారు. యాసంగి ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇదే అంశంపై రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
 
ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావానికి అనుగుణంగా యాసంగిలో వరియేతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం ధాన్యాన్ని సేకరించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పింది. దీంతో తెరాస ఎల్పీ సమావేశంలో ఇదే అంశంపై ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 
 
అదేసమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని విమర్శలు చేస్తున్నారు. అలాగే, రైతులతో కోటి సంతకాలు సేకరించాలన్న యోచనలో ఉంది. ఇక తెరాస ఎల్పీ సమావేశం తర్వాత మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కలుసుకుని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments