Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా... హైకోర్టుకు అఫిడవిట్

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (16:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకలా ప్రవేశ పరీక్షలను వాయిదావేశారు. ఈమేరకు ఆ రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. 
 
గత కొన్ని రోజులుగా తెలంగాణాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పరిధిలో ఇది మరింత ఉధృతంగా ఉంది. దీంతో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రంలో ఎంసెట్ సహా కీలక ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి తెలంగాణలో రేపటి నుంచి పలు ప్రవేశ పరీక్షలను నిర్వహించాల్సివుంది. వీటిలో కీలకమైన ఎంసెట్ పరీక్షలకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
 
అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. 
 
ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లా సెట్, పాలీసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments